వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో గెల్వలాంబ ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 4న బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.20,016, రెండో బహుమతిగా రూ.10,116 అందజేయనున్నారు. మూడో బహుమతి రూ.5,116, నాలుగో బహుమతి రూ.2,516గా నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనే జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

