వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో సెమీకండక్టర్ తయారీని బలపరిచి, స్వావలంబన సాధించే లక్ష్యంతో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0'కు రూ.1,27,500 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు.
దిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, అధునాతన ప్యాకేజింగ్, పరికరాలు, మెటీరియల్స్ వంటి సమగ్ర వ్యవస్థను ఈ పథకం ద్వారా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...
