వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల, రాజీవ్ కాలనీలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, ఇళ్లు ఉన్న ప్రాంతంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంపిక చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

