వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ రైతుల నుంచి 10 శాతం కమీషన్ వసూలవుతున్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి జులై వరకు 1,09,395 టన్నుల చీనీ విక్రయాలతో రూ.396 కోట్ల వ్యాపారం జరిగింది.
ఈ లెక్కన రూ.39 కోట్లకు పైగా కమీషన్ వసూలైనట్లు తెలుస్తోంది. కమీషన్ తీసుకోకూడదని వ్యాపారులను హెచ్చరించామని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

