Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టీల పేరుతో రూ.3 కోట్ల మోసం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 2:14 PM గుంటూరుGeneral
చిట్టీల పేరుతో రూ.3 కోట్ల మోసం - Udayam
హైదరాబాద్ అమీన్‌పూర్‌లో చిట్టీల పేరుతో సుమారు రూ.3 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గుంటూరుకు చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు సాయి గణేశ్ టెక్స్‌టైల్స్ నిర్వహిస్తూ చిట్టీల ద్వారా డబ్బులు సేకరించినట్లు బాధితులు తెలిపారు. గడువు పూర్తయినా సభ్యులకు నగదు చెల్లించకుండా ఇంటిని అమ్మేసి రాత్రికి రాత్రే పరారైనట్లు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...