Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐకి రూ.3.20 లక్షల జరిమానా

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 9:30 PM హైదరాబాద్తెలంగాణ
ఎస్‌బీఐకి రూ.3.20 లక్షల జరిమానా - Udayam Digital
ఆస్తి పత్రాలు పోగొట్టిన కేసులో ఎస్‌బీఐకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. బాధితుడికి రూ.3 లక్షల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. గృహ రుణం కోసం జమ చేసిన అసలు పత్రాలు కనిపించకపోవడంతో వెంకటేశం ఫిర్యాదు చేశారు. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల మానసిక ఆందోళనకు గురయ్యారని పేర్కొంటూ కమిషన్‌ తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...