Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఓటు కాపాడాలి: జూపల్లి

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 2:40 PM ఆసిఫాబాద్తెలంగాణ
అర్హులైన ప్రతి ఓటు కాపాడాలి: జూపల్లి - Udayam
ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అర్హులైన ప్రతి ఓటరి ఓటు హక్కును కాపాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిర్పూర్‌లో జరిగిన సమీక్షలో సిర్పూర్‌, ఆసిఫాబాద్‌లో 84,990 అనమాలీస్‌, 48,139 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఈ జాబితాలో అర్హుల పేర్లు కూడా ఉండొచ్చని మంత్రి పేర్కొన్నారు. నోటీసుల కోసం వేచి చూడకుండా ఆధారాలతో ఫారం-7 సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...