వార్తలకు తిరిగి వెళ్లండి
దుబ్బాకలో మొక్కలు నాటిన సర్పంచ్

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని స్మశానవాటికలో సర్పంచ్ సరోజినీ దేవి ఆధ్వర్యంలో మామిడి, కొబ్బరి మొక్కలు నాటారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.
స్మశానవాటికను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...