వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లిలో మొక్కలు నాటారు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రేమతరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు ఉసిరి, మందారం, సీతాఫలం వంటి వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, మహిళా విభాగం మరియు బాల వికాస్ చిన్నారులు పాల్గొన్నారు. నాటిన ప్రతి ఒక్క మొక్కను బాధ్యతగా సంరక్షించాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...