వార్తలకు తిరిగి వెళ్లండి
సంధ్య థియేటర్ తొక్కిసలాట: విచారణ జూలై 6కు వాయిదా
Kumar Jun 22, 2026 7:32 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago

హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు హాజరయ్యారు. బన్నీ గైర్హాజరుపై లాయర్ పిటిషన్ దాఖలు చేయగా, మెమో సమర్పించాలని కోర్టు సూచించింది.
ప్రస్తుతానికి విచారణను జూలై 6కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
Comments
Loading comments...