వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన చేపట్టారు. చింతకుంటలో నిర్మించిన 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే సీపీఐ ఆధ్వర్యంలోనే ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. నివాస గృహాల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

