వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణ సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపిస్తూ బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేసి, వాటికే వినతిపత్రాలు అందజేస్తూ తమ అసహనాన్ని తెలియజేశారు.
గత మూడు నెలలుగా సమావేశాలు జరగక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు మండిపడ్డారు. తక్షణమే సమావేశం నిర్వహించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

