Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు కూలీల మృతి

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 11:17 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ఇసుక ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు కూలీల మృతి - Udayam Digital
అనకాపల్లి మండలం సంపతిపురం సమీపంలో శారదా నది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. మృతులను ముసిలినాయుడు, మంగగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గ్రామీణ ఎస్సై రవికుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...