వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి మండలం సంపతిపురం సమీపంలో శారదా నది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
మృతులను ముసిలినాయుడు, మంగగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గ్రామీణ ఎస్సై రవికుమార్ తెలిపారు.
Comments
Loading comments...
