వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2.73 కోట్ల DMFT నిధులతో ఎస్.కోటలో 210 తాగునీటి బోర్లు మంజూరైనట్లు విజయనగరం జిల్లా ఎస్ కోట MLA కోళ్ల లలిత కుమారి బుధవారం తెలిపారు.
ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్ కోట మండలంలో 86, ఎస్ కోట 42, వేపాడ 33, జామి 25, కొత్తవలస మండలంలో 24 బోర్లు తవ్వేందుకు అనుమతులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాలకు మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పెర్కొన్నారు.
Comments
Loading comments...

