వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రత్యేక సాంకేతిక బృందం విశేషంగా కృషి చేస్తోందని ఎస్పీ రాజేష్చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.81 కోట్ల విలువైన 1,133 ఫోన్లను రికవరీ చేసినట్లు మంగళవారం వెల్లడించారు.
గత 20 రోజుల్లోనే రూ.23 లక్షల విలువైన 139 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు 5,414 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

