వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదోనిలో రుక్మిణి పాండురంగ స్వామి కల్యాణోత్సవం

ఆదోని విక్టోరియాపేటలోని పాండురంగ స్వామి ఆలయంలో సోమవారం రుక్మిణి పాండురంగ స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భవసార క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా వేడుకలు జరిగాయి.
కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి బాబురావుతో పాటు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...