వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వాహకులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆశ్రమ పీఠాధిపతి మౌన స్వామి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం ఆశ్రమంలోని శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు కలిసి గీతా పారాయణం చేశారు. దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...
