Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 10:15 AM మంచిర్యాలతెలంగాణ
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో రాత్రి నుండి మోస్తారు నుంచి భారీ వర్షం నమోదయింది. దీంతో ప్రధాన రహదారితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 5, 12 వార్డులలో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. చిన్న వర్షం పడినప్పుడల్లా తమకు ఇబ్బందులు తప్పడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...