Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే ప్రథమ చికిత్స

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 10:51 PM కరీంనగర్General
రోడ్డు ప్రమాద బాధితురాలికి ఎమ్మెల్యే ప్రథమ చికిత్స - Udayam
ఆదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానవత్వం చాటుకున్నారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన మహిళ ముఖంపై కారుతున్న రక్తాన్ని కాటన్‌తో శుభ్రం చేసి, ఆయింట్‌మెంట్‌ రాసి స్వయంగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...