వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారంలోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న కాలనీ బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టి పరిశ్రమకు మట్టి, ఇతర సామగ్రిని కాలనీ మధ్య నుంచి తరలించడంతో
రహదారులు దెబ్బతిని బురదమయంగా మారాయని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

