Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల అడవుల్లో రోబో పహారా

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 6:50 AM తిరుపతిGeneral
తిరుమల అడవుల్లో రోబో పహారా - Udayam
తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించి భక్తులకు భద్రత కల్పించేందుకు తితిదే నాలుగు కాళ్ల రోబో డాగ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. చిరుతల సంచారాన్ని ముందుగానే పసిగట్టేలా దీన్ని రూపొందించారు. జంతువులు భక్తుల మార్గంవైపు వస్తే జియో ట్యాగ్‌ అలర్ట్‌, లైవ్‌ వీడియో, థర్మల్‌ ఫీడ్‌ను కంట్రోల్‌ రూమ్‌కు పంపుతుంది. బ్రహ్మోత్సవాల్లో దీనిని వినియోగించనున్నట్లు అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.

Comments

G
Loading comments...