వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రశాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీ

తుని - అనకాపల్లి మధ్య ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో నలుగురు దుండగులు కత్తులతో బెదిరించి ప్రయాణికులను దోచుకున్నారు. ఒడిశాకు చెందిన ఆరుగురు ప్రయాణికుల నుంచి రూ.30 వేల నగదు, మూడు సెల్ఫోన్లు లాక్కుని అనకాపల్లిలో పరారయ్యారు.
బాధితుల సమాచారంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు విజయవాడ పరిసర ప్రాంతాల వారిగా గుర్తించి, సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...