వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాకు చెందిన చెలుముల పరుశురాములు(38) జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సిద్దిపేటకు వెళ్లి నగరానికి తిరిగి వస్తుండగా మజీద్పూర్ చౌరస్తా వద్ద ప్రమాదానికి గురయ్యారు.
మజీద్పూర్ చౌరస్తా వద్ద కారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో పరుశురాములు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

