వార్తలకు తిరిగి వెళ్లండి

లంకలపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు కల్వర్టును ఢీకొని వాగులో పడిన ప్రమాదంలో వనమాల లక్ష్మి(40) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు.
పెళ్లి అనంతరం మణుగూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

