వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి పెళ్లి ముగించుకుని మణుగూరుకు తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వనమాల లక్ష్మి మృతిచెందారు. రెండో కుమార్తె దేవి, మరో వ్యక్తి గాయపడ్డారు. వాడపల్లి నుంచి కారులో బయలుదేరిన కుటుంబం లంకాలపల్లి వద్ద ప్రమాదానికి గురైంది.
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడింది. డ్రైవింగ్ చేస్తున్న భర్త వెంకటేశ్వర్లు నిద్రమత్తులోకి జారడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

