Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
p.g.murthy Aug 17, 2026 10:03 PM మంచిర్యాలGeneral
రంగంపేటలో మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య - Udayam
మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్షెట్టిపేట మండలంలోని రంగంపేట గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై సురేష్ వివరాల ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశం ఈనెల 15న మద్యం సేవించడంతో ఆయన భార్య మందలించిందన్నారు. దీంతో మనస్థాపం చెందిన వెంకటేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్కు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.

Comments

G
Loading comments...