వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజిగి : తుముకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచిస్తూ, ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతకు రాయబారిగా మారాలని పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అవగాహనతోనే ప్రాణాలను కాపాడుకోవచ్చని, సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత అని తెలిపారు.
Comments
Loading comments...

