వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాల స్థలంలో అక్రమ కట్టడాల తొలగింపు

శ్రీ సత్య సాయి జిల్లా మొగలిచెట్ల తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇల్లను అధికారులు శుక్రవారం ప్రోక్లైన్ సాయంతో తొలగించారు. సర్వే నంబరు 1199-1 లో ఒక సెంటుకు పైగా స్థలం ఆక్రమణకు గురైనట్లు ఎమ్మార్వో సురేంద్రనాథ్ పరిశీలనలో తేలింది.
దీంతో తహసీల్దార్ సురేంద్రనాథ్, కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు.
Comments
Loading comments...