వార్తలకు తిరిగి వెళ్లండి
అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలి

కడప జిల్లా తెల్లపాడు గ్రామానికి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరుతూ స్థానికులు శుక్రవారం తహసీల్దార్ రవీంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. తెదేపా నాయకుల ఆధ్వర్యంలో తరలివచ్చిన వారు ఈ వినతిని సమర్పించారు.
కలసపాడులో ఉన్న 1800 ఎకరాల ప్రభుత్వ భూమిలో నకిలీ, అనర్హుల పట్టాలను రద్దు చేయాలని, బడుగు బలహీన వర్గాల వారికి ఒక్కొక్కరికి 1.50 ఎకరాల చొప్పున భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...