Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలి

స్వాతి రెడ్డి Jul 17, 2026 3:04 PM కడపabout 1 hour ago
అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలి - Udayam Digital
కడప జిల్లా తెల్లపాడు గ్రామానికి చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరుతూ స్థానికులు శుక్రవారం తహసీల్దార్ రవీంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. తెదేపా నాయకుల ఆధ్వర్యంలో తరలివచ్చిన వారు ఈ వినతిని సమర్పించారు. కలసపాడులో ఉన్న 1800 ఎకరాల ప్రభుత్వ భూమిలో నకిలీ, అనర్హుల పట్టాలను రద్దు చేయాలని, బడుగు బలహీన వర్గాల వారికి ఒక్కొక్కరికి 1.50 ఎకరాల చొప్పున భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...