వార్తలకు తిరిగి వెళ్లండి
కరెంట్ షాక్తో వ్యక్తి మరణం

ఏలూరు జిల్లా వెంకటరామాంజిపురానికి చెందిన ముప్పిడి వెంకటరెడ్డి(40) పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి ఆయనను వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తరలించే లోపే వెంకటరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...