వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
కాగా, ఉదయం 9 గంటల నుంచే గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో ప్రత్యేక సమీక్ష జరపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Comments
Loading comments...

