వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బోడి రామయ్య పాడి ఆవుపై గురువారం రాత్రి చిరుతలు దాడి చేసి చంపినట్లు తెలిపారు. పశువుల పాకలో కట్టివేసిన ఆవుపై దాడి జరగడంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది.
చిరుతల సంచారాన్ని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను గ్రామస్థులు కోరారు. చిరుతల సంచారంపై అధికారులు నిఘా పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

