వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ బెనిఫిట్ సెటిల్మెంట్ వివరాలను ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో పనిచేసే శివానంద్ రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఈ దాడి జరిగింది.
సోమవారం మధ్యాహ్నం నిందితుడు తన కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

