వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం భూముల వేలాన్ని అడ్డుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బిడ్లు రాలేదని వేలాన్ని కొద్దిరోజులు వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించింది.
సర్వే నంబర్ 83లోని 11.12 ఎకరాల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఎల్ఆర్టీ ముందు విచారణ పెండింగ్లో లేనప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మధ్యంతర ఉత్తర్వులతో ఆపలేమని పేర్కొంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Comments
Loading comments...

