Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామేశ్వరం జాలర్లు అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Aug 13, 2026 11:11 AM ఆల్ ఇండియా జాతీయ
పాక్ జలసంధిలో సరిహద్దు దాటి చేపలు వేటాడారనే ఆరోపణలతో రామేశ్వరానికి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేసింది. వారి బోటును స్వాధీనం చేసుకుని తలైమన్నార్‌కు తరలించింది. అరెస్టైన మత్స్యకారులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తోటి మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

Comments

G
Loading comments...