వార్తలకు తిరిగి వెళ్లండి
రామాలయ విరాళాల కేసు.. సిట్కు సుప్రీం ఆదేశాలు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దర్యాప్తుకు ఐపీఎస్ అధికారి కిరణ్ ఎస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తు బృందంలో చార్టర్డ్ అకౌంటెంట్ను కూడా నియమించాలని, రెండు వారాల్లో పురోగతి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...