వార్తలకు తిరిగి వెళ్లండి
'సీతారామ ప్రాజెక్టు'తో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: తుమ్మల

సీతారామ ప్రాజెక్టు ద్వారా రూ.90 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి గోదావరి జలాలను తరలిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వెంకటాయపాలెంలో కలెక్టర్తో కలిసి ఆయన జలాలకు పూజలు చేశారు.
ఈ కెనాల్ ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...