వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగుకు బదులు ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఏడిఏ కృష్ణ, దండేపల్లి ఏవో అంజిత్ కుమార్ కోరారు. మంగళవారం దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామంలో పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు.
నీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుగుణ, మాజీ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ రమణయ్య, రేణు శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Loading comments...

