వార్తలకు తిరిగి వెళ్లండి
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని గుమ్మడం సబ్స్టేషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక రైతులతో కలిసి సందర్శించారు. సబ్స్టేషన్ లాగ్బుక్ను పరిశీలించి రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరచూ సుదీర్ఘంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఆరు గంటలు కూడా నిరంతర విద్యుత్ అందడం లేదని రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

