వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం వెంకటయ్యపల్లి రైతు వేదికలో వరి సన్న రకాలు సాగు చేస్తున్న రైతుల నుంచి ఏఈఓ సాయికృష్ణ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు సేకరించారు. గతేడాది నిల్వ చేసిన లేదా రీసెర్చ్ స్టేషన్ నుంచి పొందిన విత్తనాలతో సాగు చేస్తున్న రైతులు డిక్లరేషన్ సమర్పించాలని సూచించారు.
డిక్లరేషన్ నమోదు చేసుకోకపోతే ప్రభుత్వం అందించే బోనస్ పొందే అవకాశం ఉండదని తెలిపారు. నేడే చివరి గడువు కావడంతో రైతులు వెంటనే సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

