వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి పట్టణ తపాలా కార్యాలయం ఆవరణ వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వృద్ధులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ రహదారి పనుల్లో మురుగు కాలువలు పూర్తి కాకపోవడంతో నీరు నిలిచిందని స్థానికులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...
