వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుండి కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడనున్నాయి. గత 24 గంటల్లో విజయనగరం జిల్లా వేపాడలో అత్యధికంగా 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, ఉత్తర కోస్తా మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

