వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు, మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాకు అధికారులు అత్యంత కీలకమైన ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
నల్గొండ, రంగారెడ్డి, భువనగిరి సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికే హైదరాబాద్ రోడ్లు జలమయం కావడంతో, తాజా హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

