వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో నాలుగు నుంచి ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
బుధవారం ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
