Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగతనం

జయ ప్రకాష్ Jul 10, 2026 1:33 AM అనంతపురం 1 viewsabout 2 hours ago
రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగతనం - Udayam Digital
అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఉమాదేవి ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఆమె విధులకు వెళ్లిన సమయంలో చొరబడి 25 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.20 వేల నగదు దోచుకున్నారు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దుండగులు ఇంటికి నిప్పంటించడంతో సామగ్రి, సర్టిఫికెట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...