వార్తలకు తిరిగి వెళ్లండి
సింగపూర్కు కుప్పం మామిడి ఎగుమతి

చిత్తూరు జిల్లా కుప్పం, వి.కోట ప్రాంతాల రైతుల నుంచి సేకరించిన తోతాపురి, బంగినపల్లి మామిడి కాయలను సింగపూర్కు ఎగుమతి చేయడం ప్రారంభించారు. చింతామణి ప్యాక్ హౌస్ నుండి 5 టన్నుల మామిడితో కూడిన కంటైనర్ చెన్నై ఓడరేవు ద్వారా నౌకలో బయల్దేరింది.
కుప్పం పరిసర ప్రాంతాల్లో ప్యాక్ హౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే విదేశీ ఎగుమతులు మరింత పెరిగి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...