Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ట్రాక్పై మృతదేహం

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 7:37 PM విజయనగరంGeneral
రైల్వే ట్రాక్పై మృతదేహం - Udayam
కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతుడు వయస్సు సుమారు 60-65 ఏళ్లు ఉంటాయని తెలిపారు. 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయతో ఉండి ఎరుపు రంగు బనియన్, తెలుపు-నీలం-నలుపు చెక్స్ షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. విజయనగరం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...