వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద 9.890 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్ లభించింది.
పట్టణ ఎస్ఐ ఎం. ముకుందరావు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం. చిన్నమ నాయుడు మంగళవారం తెలిపారు.
Comments
Loading comments...

