వార్తలకు తిరిగి వెళ్లండి
గుడుంబా స్థావరాలపై దాడులు

కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
సరైన ధ్రువపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేసి 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా తయారీ చట్టవిరుద్ధమని, పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...