Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:40 PM జాతీయంGeneral
మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు - Udayam
మహారాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 2.07 కోట్ల మంది పేర్లు తొలగించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. బీజేపీ, ‘ఓట్‌ చోరీ ఆయోగ్‌’ వ్యూహాలు మారుతున్నాయని, బీజేపీ గెలుపే లక్ష్యమని ఆయన ఆరోపించారు. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని గతంలో చెప్పానని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రాధాన్యం లేకుండా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...